‘విరూపాక్ష’.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది: సాయి ధరమ్ తేజ్

ఏప్రిల్ 21న విడుదల కాబోతున్న ‘విరూపాక్ష’ గురించి సాయి ధరమ్‌తేజ్ అసక్తికర విషయాలు వెల్లడించాడు. సంయుక్తా మీనన్ కథానాయికగా నటించిన

Update: 2023-04-19 13:04 GMT

దిశ, సినిమా : ఏప్రిల్ 21న విడుదల కాబోతున్న ‘విరూపాక్ష’ గురించి సాయి ధరమ్‌తేజ్ అసక్తికర విషయాలు వెల్లడించాడు. సంయుక్తా మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. కాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన చిత్రంతో తన మెచ్యూరిటీ పెరిగిందని, ఇకపై అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉంచాలనుకుంటున్నట్లు తెలిపాడు తేజ్. అలాగే రికార్డుల మీద తనకు ఆశ లేదని, ఈ సినిమా సక్సెస్ అయితే మూవీ యూనిట్ అంతా హ్యాపీగా ఉంటామన్నాడు. ఇక ‘విరూపాక్ష’ అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దానితో ఇందులో పోరాటం చేస్తామని, అందుకే చిత్రానికి ఈ టైటిల్ పెట్టామని తెలిపాడు. చివరగా ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ప్రేక్షక దేవుళ్లు ఆదరించాలని కోరాడు.

Also Read..

సాయి ధరమ్‌తేజ్ ‘విరూపాక్ష’ ప్రివ్యూ షో ఫ‌స్ట్ రివ్యూ  

Tags:    

Similar News