Puri Jagannadh తదుపరి చిత్రం ఆ హీరోతోనే!!

టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అంటే అందరికీ టక్కున్న గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలందరితో వర్క్ చేసిన పూరి, రికార్డులు తిరగరాశారు.

Update: 2022-09-29 03:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అంటే అందరికీ టక్కున్న గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలందరితో వర్క్ చేసిన పూరి, రికార్డులు తిరగరాశారు. అయితే, ఈ మధ్య కాలంలో వరుస ప్లాపులతో కాస్త సతమతమవుతున్నారు. తాజాగా.. విజయ్ దేవరకొండతో ఎన్నో అంచనాలతో 'లైగర్' సినిమా తీశారు. అనుకున్న స్థాయిలో ఈ సినిమా రాణించలేదు.

ఈ క్రమంలో పూరికి మరోటాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అంటే అందరికీ టక్కున్న గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలందరితో వర్క్ చేసిన పూరి, రికార్డులు తిరగరాశారు.పూరి కి చేదు అనుభవం ఎదురైంది. దీంతో పూరితో వర్క్ చేసేందుకు హీరోలు కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, లైగర్‌కు ముందు రామ్ పోతినేనితో 'ఇస్మార్ట్ శంకర్‌' తీసి హిట్ కొట్టాడు పూరి. దీంతో మరోసారి రామ్‌ పోతినేనితో సినిమా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తన కుమారుడు ఆకాష్ పూరితోనూ సినిమా తీయబోతున్నాడని వార్తలు విస్తృతమయ్యాయి. కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక పూరి జగన్నాథ్ పుట్టినరోజున తదుపరి సినిమా గురించి కీలక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతవరకు నిజయో తెలియాల్సి ఉంది. 

ఇవి కూడా చ‌ద‌వండి :

Unstoppable With NBK: బాలయ్యతో సందడి చేయనున్న చంద్రబాబు

Tags:    

Similar News