Mahesh Babu వల్ల ఆ డైరెక్టర్‌కు రూ.7 కోట్ల నష్టం.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ ఏ ముహూర్తాన ‘‘సర్కారు వారి పాట’’ చిత్రాన్ని ఓకే చేశాడో కానీ అప్పటి నుంచి ఆయనకు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు.

Update: 2023-06-06 15:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ ఏ ముహూర్తాన ‘‘సర్కారు వారి పాట’’ చిత్రాన్ని ఓకే చేశాడో కానీ అప్పటి నుంచి ఆయనకు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. అయితే గతంలో నాగచైతన్యతో ఓ సినిమా చెయ్యడానకి కమిట్ అయ్యాడు. ఆ సినిమా కోసం 14 రీల్స్ సంస్థ నుంచి 6 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడట. ఆ మూవీ స్టార్ట్ అయ్యే సమయంలో మహేష్ బాబుతో ఆఫర్ వచ్చింది. దీంతో చైతూకు హ్యాండ్ ఇచ్చాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఈ సంస్థకు వడ్డీతో కలిపి రూ.13 కోట్లు కట్టాల్సి వచ్చిందట. కాగా.. మహేష్ ఆఫర్ వల్ల ఈ దర్శకుడికి మొత్తం 7 కోట్ల నష్టం వచ్చిందట. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో నాగ చైతన్య, అల్లు అరవింద్.. పరశురామ్ గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పరిశ్రమలో పరశురామ్ గురించే చర్చ నడుస్తుంది.

Also Read..

జక్కన్నను వెయిట్ చేయిస్తున్న Mahesh Babu 

Akkineni Nagarjuna మేనకోడలితో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి!  

Tags:    

Similar News