పెళ్లైన స్టార్ హీరోను పెళ్లి చేసుకున్న అలియా భట్.. సోషల్ మీడియాలో శోభనం వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని శోభనం గదిలో ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని శోభనం గదిలో ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కానీ అదంతా నిజం కాదని తెలుస్తోంది. అది ఓ యాడ్ షూట్లో భాగం. అయితే అలియా భట్, రియల్ లైఫ్లో రణ్బీర్ కపూర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఇక రణ్వీరం సింగ్ కూడా దీపికను పెళ్లి చేసుకున్నా.. స్క్రీన్పై మాత్రం రణ్వీర్, అలియాకు చాలా మందే అభిమానులు ఉన్నారు. బెస్ట్ స్క్రీన్ జోడీగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా, అలియా భట్, రణ్వీర్ కలిసి జంటగా ఓ యాడ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ అందరిని ఆకట్టుకుంటుంది. మేక్ మై ట్రిప్ కోసం చేసిన యాడ్లో రణ్వీర్, అలియ పెళ్లైన కొత్త జంటగా కనిపించారు. శోభనం గదిలో అలియ బెడ్పై కూర్చొని ఉండగా.. ఆమె దగ్గరకు భర్త రణ్వీర్ సింగ్ వస్తాడు.
నాకిదే తొలిసారి అని అనడంతో.. అలియ స్పందిస్తూ నాకూడా ఫస్ట్ టైమ్ అంటుంది. అయితే టెన్షన్ పడకు ఈజీగానే అయిపోతుంది అని ధైర్యం చెబుతుంది. దీంతో రణ్వీర్ ఇది ప్రయాణమే కదా గమ్యం కాదని అంటాడు. ఆ తర్వాత అలియా భట్ మొదలు పెడదామా అని.. మొబైల్ తీసి నేను మేక్పై ట్రిప్లో ప్రారిస్ హనీమూన్కు ఫ్లైట్స్ చూస్తాను అని తెలుపుతుంది. ఇక రణ్వీర్ నేను హోటల్స్ చూస్తానని చెప్పి ఇద్దరు కలిసి ఫోన్ చూస్తూ కనిపిస్తారు. ఫస్ట్ టైమ్ జర్నీ చేయడానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అనడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం రణ్వీర్, అలియా భట్ యాడ్ అందరినీ ఆకట్టుకుంటుంది.