అడవుల్లో ఉత్కంఠ… నేటి నుంచి వారోత్సవాలు

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నేటి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎదురుకాల్పులు చోటుచేసుకుని, ఇద్దరు మావోలు హతం అయిన సంగతీ తెలిసిందే. అంతేగాకుండా ఈ కాల్పుల్లో తప్పించుకున్న ఇతర మావోలు, కీలక నేత భాస్కర్‌ కోసం పోలీసులకు దాదాపు 400 మంది పోలీసులతో అసిఫాబాద్ […]

Update: 2020-09-20 20:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నేటి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎదురుకాల్పులు చోటుచేసుకుని, ఇద్దరు మావోలు హతం అయిన సంగతీ తెలిసిందే. అంతేగాకుండా ఈ కాల్పుల్లో తప్పించుకున్న ఇతర మావోలు, కీలక నేత భాస్కర్‌ కోసం పోలీసులకు దాదాపు 400 మంది పోలీసులతో అసిఫాబాద్ అడవుల్లో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ వారోత్సవాలకు పిలుపునివ్వడంతో అడవుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News