28న మోడీతో దీదీ భేటీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ నెల 28న మమతా బెనర్జీ భేటీ కానున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలవనున్నారు. ‘నేను మూడు రోజుల ఢిల్లీ పర్యటన చేయబోతున్నాను. ఈ పర్యటనలో ప్రధానిని కలుస్తాను. అందుకు సమయం కుదిరింది. రాష్ట్రపతినీ కలవబోతున్నాను’ అని గురువారం మమతా బెనర్జీ వెల్లడించారు. ప్రధానితో మమతా బెనర్జీ 28న సమావేశం కాబోతున్నట్టు సమాచారం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసే తేదీలు ఇంకా తెలియరాలేదు. ఈ నెల చివరన ఢిల్లీ వెళ్లనున్న […]

Update: 2021-07-22 11:37 GMT

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ నెల 28న మమతా బెనర్జీ భేటీ కానున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలవనున్నారు. ‘నేను మూడు రోజుల ఢిల్లీ పర్యటన చేయబోతున్నాను. ఈ పర్యటనలో ప్రధానిని కలుస్తాను. అందుకు సమయం కుదిరింది. రాష్ట్రపతినీ కలవబోతున్నాను’ అని గురువారం మమతా బెనర్జీ వెల్లడించారు.

ప్రధానితో మమతా బెనర్జీ 28న సమావేశం కాబోతున్నట్టు సమాచారం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసే తేదీలు ఇంకా తెలియరాలేదు. ఈ నెల చివరన ఢిల్లీ వెళ్లనున్న దీదీ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉన్నది.

Tags:    

Similar News