మందుబాబులకు అడ్డా.. బల్మూర్ రైతు వేదిక

దిశ, అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు వేదిక నిర్మాణం చేపట్టింది. ఆ వేదికల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు పంటలపై తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉపయోగించుకోవాలని నూతన వేదికల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. అయితే… అందుకు విరుద్ధంగా నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని రైతు వేదిక మందుబాబులకు నిలయంగా మారింది. రైతుల సమస్యల ముచ్చటించుకోవాల్సింది పోయి స్థానిక నాయకులు మద్యం సేవించడాన్ని ప్రజలు, అధికారులు ఆగ్రహం వ్యక్తం […]

Update: 2021-04-15 05:39 GMT

దిశ, అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు వేదిక నిర్మాణం చేపట్టింది. ఆ వేదికల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు పంటలపై తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉపయోగించుకోవాలని నూతన వేదికల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. అయితే… అందుకు విరుద్ధంగా నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని రైతు వేదిక మందుబాబులకు నిలయంగా మారింది. రైతుల సమస్యల ముచ్చటించుకోవాల్సింది పోయి స్థానిక నాయకులు మద్యం సేవించడాన్ని ప్రజలు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవిస్తున్న వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మద్యం సేవించిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News