కేంద్ర మంత్రితో కేటీఆర్ సమావేశం.. ధాన్యం కొనుగోళ్లపై కీలక చర్చలు

దిశ, కరీంనగర్ సిటీ: కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరింది. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చి చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం, రబీ పంట కొనుగోళ్ల అంశాలను వివరించారు. […]

Update: 2021-11-23 11:34 GMT

దిశ, కరీంనగర్ సిటీ: కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరింది. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చి చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం, రబీ పంట కొనుగోళ్ల అంశాలను వివరించారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులున్నారు.

Tags:    

Similar News