రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఖుష్బూ కామెంట్స్

దక్షిణాది నటి ఖుష్బూ ఇటీవలే త‌న స‌హ న‌టులైన ర‌జినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో కమల్ బాగానే రాణించారు. రజనీ త్వరలోనే తన పార్టీని ప్రారంభిస్తారని అనుకుంటున్నాను. ప్రజలు, రాష్ర్టాభివృద్ధి కోసం ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. రజనీకాంత్ కింగ్‌లా ఉండాలి. కింగ్ మేకర్ కాకూడదు. అప్పడు ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తారు. క‌రుణానిధి, జ‌య‌ల‌లిత చనిపోయిన త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో లోటు ఏర్పడింది. రజనీ, కమల్ […]

Update: 2020-06-07 01:47 GMT

దక్షిణాది నటి ఖుష్బూ ఇటీవలే త‌న స‌హ న‌టులైన ర‌జినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో కమల్ బాగానే రాణించారు. రజనీ త్వరలోనే తన పార్టీని ప్రారంభిస్తారని అనుకుంటున్నాను. ప్రజలు, రాష్ర్టాభివృద్ధి కోసం ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. రజనీకాంత్ కింగ్‌లా ఉండాలి. కింగ్ మేకర్ కాకూడదు. అప్పడు ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తారు. క‌రుణానిధి, జ‌య‌ల‌లిత చనిపోయిన త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో లోటు ఏర్పడింది. రజనీ, కమల్ అనే కాదు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి రావాలి. యువ నటీనటులు వస్తే.. రాజకీయాల్లో మార్పు వస్తుంది. వారిని ప్రోత్సహించాలి’ అని ఖుష్బూ తెలిపారు. ప్రస్తుతం ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News