వారిని కాపాడండి….

దిశ వెబ్ డెస్క్ : గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామస్తులను వరద నీటి నుంచి కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. పరిహారం అందకపోవడంతోనే తాము అక్కడ ఉండి పోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారని ఆయన తెలిపారు. గ్రామస్తులు వరద నీటిలో చిక్కుకున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో రిజర్వాయర్ లోకి నీటి విడుదలపై సంయమనం పాటించాలని ఆయన కోరారు. నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేసేందుకు ప్రయత్నించవద్దని ఆయన అన్నారు. […]

Update: 2020-09-26 05:24 GMT

దిశ వెబ్ డెస్క్ :
గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామస్తులను వరద నీటి నుంచి కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. పరిహారం అందకపోవడంతోనే తాము అక్కడ ఉండి పోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారని ఆయన తెలిపారు.

గ్రామస్తులు వరద నీటిలో చిక్కుకున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో రిజర్వాయర్ లోకి నీటి విడుదలపై సంయమనం పాటించాలని ఆయన కోరారు. నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేసేందుకు ప్రయత్నించవద్దని ఆయన అన్నారు. నిర్వాసితులు తమ ఇష్ట పూర్వకంగానే ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దాని కోసం వారితో అధికారులు సంప్రదింపులు జరపాలని ఆయన అన్నారు.

Tags:    

Similar News