Sunrisers Hyderabad : డబుల్ సెంచరీ కొట్టిన సన్ రైజర్స్

ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ డబుల్ సెంచరీ కొట్టింది. 20 ఓవర్లలో సన్ రైజర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

Update: 2023-05-21 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్: ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ డబుల్ సెంచరీ కొట్టింది. 20 ఓవర్లలో సన్ రైజర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ 69 రన్స్ చేయగా.. మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 83 రన్స్ చేసి ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. ఓపెనర్లిద్దరూ కలిసి 140 భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 4 ఓవర్లు వేసి 37 రన్స్ ఇచ్చి 4 వికెట్లు నెలకొల్పాడు. ఇక ముంబై గెలవాలంటే 201 పరుగులు చేయాల్సి ఉంది.

కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ తో టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ కు పోవాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది. ఇక ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఇక నాలుగో ప్లేస్ కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి.

Tags:    

Similar News