ఐపీఎల్‌లో గ్రేటెస్ట్ కెప్టెన్ ధోని కాదు.. ఓటింగ్‌లో గెలిచింది అతనే..?

ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకాదరన పోందిన టోర్నమెంట్ లో ఐపీఎల్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.

Update: 2024-04-29 15:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకాదరన పోందిన టోర్నమెంట్ లో ఐపీఎల్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అంతటి ప్రజాదరణ పొందిన ఐపీఎల్ లో అన్ని సీజన్లలో కలిపి గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. క్రిక్ క్రాకర్ అనే ట్విట్టర్ పేజీలో ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరనే పోటీ నిర్వహించారు. కాగా ఈ పోల్ మొత్తం ఎనిమిది మంది కెప్టెన్లు అయిన.. ధోని, రోహిత్, గంభీర్, వార్నర్, షేన్ వార్న్, కోహ్లీ, గిల్‌క్రిస్ట్, విలిమమ్‌సన్ పోటీలో ఉన్నారు. కాగా ఈ పోల్ లో ఆయా కెప్టెన్లకు వచ్చిన కామెంట్లను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరిని తొలగిస్తూ వచ్చారు. ఈ పోటీలో చివరికి చెన్నై కెప్టెన్ ధోని, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలు ఫైనల్ రేసులో నిలిచారు. కాగా చివరకు రోహిత్ శర్మనే ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. కాగా ఈ పోటీలో నిలిచిన కెప్టెన్లలో రోహిత్, ధోని ఐదు సార్లు తమ జట్లకు కప్ సాధించారు.

Similar News