ఉప్పల్‌లో IPL మ్యాచ్.. క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్

క్రికెట్ ప్రియులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్

Update: 2024-05-08 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రియులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైళ్ల సమయం పొడగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టెర్మినల్ స్టేషన్ నుండి అర్థరాత్రి 12.15 గంటలకు బయలు దేరనున్న ఆఖరి రైలు.. అర్థరాత్రి ఒంటి గంటకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపారు. అయితే ఉప్పల్ స్టేడియం-ఎన్జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి మాత్రం వీలుండదని స్పష్టం చేశారు. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన ఎస్ఆర్‌హెచ్.. ఆరింట్లో విజయం సాధించి.. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఫ్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థతి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News