IPL 2024 సండే డబల్ ధమాకా.. టాస్ గెలిచిన బెంగళూరు

ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు సండే డబల్ ధమాకా మ్యాచులు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదట మ్యాచ్ గుజరాత్, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

Update: 2024-04-28 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు సండే డబల్ ధమాకా మ్యాచులు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదట మ్యాచ్ గుజరాత్, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. గత మ్యాచ్ లో గెలిచిన ఊపు మీద ఉన్న ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు ప్రతి మ్యాచుల్లో గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే విజయం కోసం పరితపిస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క గుజరాత్ జట్టు కూడా ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో కొనసాగాలని చూస్తుంది. ప్రస్తుతం గుజరాత్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ చివరి(10)వ స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు జరిగే మ్యాచులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే సాయంత్ర వరకు వేచి చూడాల్సిందే మరి.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్(c), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(సి), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

Similar News