T20 WC: ఇప్పుడున్న వాళ్లలో అతను తప్ప ఎవరు ఆడలేరు.. ప్రముఖ మాజీ క్రికెటర్..
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
దిశ వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయినా ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు క్రికెట్పై కూడా దృష్టి సారిస్తున్నారు. మాజీ ప్లేయర్గా క్రికెట్లో జరిగే అవకతవకలను వేలెత్తి చూపిస్తున్నారు. ఇక నిన్న T20 WCకి భారత జట్టు ఎంపిక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సెలక్షన్ ప్యానెల్ నలుగురు రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. ఇందులో శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ఉన్నారు.
అయితే రింకూ సింగ్ను రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేమడంపై తాజాగా అంబటి రాయుడు స్పందించారు X వేదికగా స్పందించారు. టి20 wc జట్టులో రింకు సింగ్ లేకపోవడం అతి పెద్ద లోటు అని అంబటి రాయుడు పేర్కొన్నారు. రింకూ సింగ్ను తప్పించడం చూస్తుంటే క్రికెటింగ్ సెన్స్ కంటే గణాంకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు.
ఇప్పుడున్న ప్లేయర్స్లో గనక చూసుకుంటే గత రెండు సంవత్సరాలలో జడేజా తప్పితే ఏ ఆటగాడు చివరి ఓవర్లలో అధిక స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను గెలిపించారు అని ప్రశ్నించారు. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చారు.