14 మందితో భార్య రాసలీలలు.. రూ100 కోట్లకు భర్త దావా

దిశ, వెబ్‌డెస్క్: 14 మందితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యకు భర్త ఊహించని షాక్ ఇచ్చాడు. భార్యకే కాదు ఆమెతో స్నేహం చేసిన 14 మంది బాయ్‌ఫ్రెండ్స్‌కు ముచ్చెమటలు పట్టించాడు. రహస్యంగా ఈ వ్యవహారం నడిపించిన భార్యకు.. భర్త మాత్రం బహిరంగంగానే బుద్ధి చెప్పాడు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాళ్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌కు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అతడు తన భార్యను ఎంతో […]

Update: 2020-07-29 11:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: 14 మందితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యకు భర్త ఊహించని షాక్ ఇచ్చాడు. భార్యకే కాదు ఆమెతో స్నేహం చేసిన 14 మంది బాయ్‌ఫ్రెండ్స్‌కు ముచ్చెమటలు పట్టించాడు. రహస్యంగా ఈ వ్యవహారం నడిపించిన భార్యకు.. భర్త మాత్రం బహిరంగంగానే బుద్ధి చెప్పాడు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వివరాళ్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌కు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అతడు తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ, ఆమె మాత్రం అతడిపై అంతగా కలిసుండేది కాదు. ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చిన భర్త.. భార్య కదలికలపై ఓ నిఘా వేశాడు. తరచూ కాల్స్ మాట్లాడటం.. బయటకు వెళ్లి రావడంతో వివాహేతర సంబంధం ఏమైనా సాగిస్తుందా అన్న కోణంలో ఓ డెటెక్టివ్‌ని నియమించుకున్నాడు. తన భార్య ఎక్కడికి వెళ్తుంది.. ఎవరెవరిని కలుస్తుందో అన్న ప్రతి ఒక్క విషయం తెలియజేయాలని అతడిని ఆదేశించాడు.

దీంతో భార్య చేసే భాగోతలను మొత్తం డిటెక్టివ్ వ్యాపారికి వివరించాడు. తన భార్య ఒకరికి తెలియకుండా మరొకరితో.. ఏకంగా 14 మందితో వివాహేతర సంబంధం సాగిస్తుందని తెలుసుకున్నఅతడు తట్టుకోలేకపోయాడు. గుండెను గట్టిగా చేసుకుని తనను మోసం చేసిన భార్య, కారకులకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్య వివాహేతర సంబంధంతో తన పరువు పోయిందని.. రూ. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పరువు నష్టం వేశాడు. ఈ నోటీసులను తన భార్యకు, 14 మంది భాయ్ ఫ్రెండ్స్‌కు పంపించాడు. తనకు డబ్బులు చెల్లించకపోతే లీగల్‌గా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ నోటీసులో హెచ్చరించాడు. ఈ నోటీసులు చదివిన వారు ఒక్కసారిగా బిత్తరపోయారు. వివాహేతర సంబంధం సాగించునందుకు రూ. 100 కోట్లు చెల్లించడమేంటని తలలు పట్టుకున్నారు.

Tags:    

Similar News