కరోనాతో పోరాడి గెలిచిన హోంమంత్రి

దిశ, క్రైమ్‌బ్యూరో: రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కరోనా మహమ్మారితో పోరాడి గెలిచారు. శుక్రవారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, మనుమడు కూడా ఇంటికి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు.ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ..తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన, తన ఆరోగ్యం పట్ల వాకబు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఫోన్ ద్వారా పరామర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల […]

Update: 2020-07-03 08:23 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కరోనా మహమ్మారితో పోరాడి గెలిచారు. శుక్రవారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, మనుమడు కూడా ఇంటికి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు.ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ..తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన, తన ఆరోగ్యం పట్ల వాకబు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఫోన్ ద్వారా పరామర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నాయకులు, ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందాలని, భయపడవద్దన్నారు.ఆ సమయంలో చల్లటి నీరు తాగొద్దని, ఇంటి భోజనం మాత్రమే చేయాలని, వ్యాయామం పట్ల శ్రద్ధ వహించాలని, భౌతిక దూరం, మాస్కులు ధరించాలని స్పష్టంచేశారు.

Tags:    

Similar News