అర్ధరాత్రి కత్తులతో బెదిరించి దేవాదుల పంప్ హౌస్‎లో భారీ చోరీ

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల పంప్ హౌస్ లో భారీ చోరీ జరిగింది.

Update: 2024-05-07 06:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల పంప్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి పూట ద్విచక్ర వాహనాలపై పంప్ హౌస్ వద్దకు వచ్చిన దుండగులు పంప్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని కత్తులతో బెదిరించారు. అనంతరం పంప్ హౌస్ లోకి చొరబడి విలువైన కాపర్ వైర్ తో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. పంప్ హౌస్ వద్ద సెక్యూరిటీని కత్తులతో బెదిరిస్తున్న విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click Here For Twitter Post

Similar News