సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడటంతో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మరోసారి సమాచారం ఇస్తామని […]

Update: 2021-09-11 00:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడటంతో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మరోసారి సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న తేజ్ ను చూసేందుకు నటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు తదితరులు వస్తున్నారు.

Tags:    

Similar News