మోదీ మాటే.. నా మాట : జీవీఎల్

దిశ ఏపీ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వల్లెవేశారు. అమరావతిలో జీవీఎల్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని ఏదో ఒక ప్రకటన చేసేందుకు ప్రజల ముందుకు రాలేదన్న ఆయన, కేవలం జాగ్రత్తలు చెప్పేందుకే వచ్చారని ఆయన వివరించారు. మొదటి […]

Update: 2020-06-30 08:20 GMT

దిశ ఏపీ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వల్లెవేశారు. అమరావతిలో జీవీఎల్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని ఏదో ఒక ప్రకటన చేసేందుకు ప్రజల ముందుకు రాలేదన్న ఆయన, కేవలం జాగ్రత్తలు చెప్పేందుకే వచ్చారని ఆయన వివరించారు. మొదటి లాక్‌డౌన్ సమయంలో ప్రజల్లో భయం ఉండేదని, ఇప్పుడా భయం కనిపించడం లేదని, తమకేం కాదులే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News