ప్రణబ్ ఆరోగ్యంగానే ఉన్నారు : అభిజిత్

దిశ, వెబ్ డెస్క్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంగానే ఉన్నారని, పుకార్లను నమ్మొద్దని ఆయన కూతురు షర్మీష్టా, కుమారుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ కొద్ది రోజుల కిందట అనారోగ్యం పాలవ్వగా ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన చికిత్స పొందుతూ మరణించారని రెండ్రోజులుగా పలు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పందించిన ప్రణబ్ కుటుంబ సభ్యులు ఫేక్ కథనాలను ప్రచురించవద్దని.. ఆ వార్తలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత మీడియా ఫేక్ న్యూస్ […]

Update: 2020-08-12 23:03 GMT

దిశ, వెబ్ డెస్క్ :

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంగానే ఉన్నారని, పుకార్లను నమ్మొద్దని ఆయన కూతురు షర్మీష్టా, కుమారుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ కొద్ది రోజుల కిందట అనారోగ్యం పాలవ్వగా ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన చికిత్స పొందుతూ మరణించారని రెండ్రోజులుగా పలు కథనాలు వెలువడుతున్నాయి.

దీనిపై స్పందించిన ప్రణబ్ కుటుంబ సభ్యులు ఫేక్ కథనాలను ప్రచురించవద్దని.. ఆ వార్తలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత మీడియా ఫేక్ న్యూస్ ఫాక్టరీగా మారిపోయిందని మండిపడ్దారు. తమ తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని కుమారుడు, కూతురు మరోసారి స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Tags:    

Similar News