సీబీఐ మాజీ డైరెక్టర్ సూసైడ్

దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీకుమార్ (69) సూసైడ్ చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సిమ్లాలోని తన నివాసంలో ఉరేవేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. 2006 నుంచి 2008వరకు హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా పనిచేసిన అశ్వనీకుమార్.. 2008 ఆగస్టు 2 నుంచి 2010 నవంబర్ 30వరకు సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. మణిపూర్, నాగాలాండ్ గవర్నర్‌గా కూడా అశ్వనీకుమార్ పనిచేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నారా.. లేకుంటే ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.. పూర్తి […]

Update: 2020-10-07 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీకుమార్ (69) సూసైడ్ చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సిమ్లాలోని తన నివాసంలో ఉరేవేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. 2006 నుంచి 2008వరకు హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా పనిచేసిన అశ్వనీకుమార్.. 2008 ఆగస్టు 2 నుంచి 2010 నవంబర్ 30వరకు సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. మణిపూర్, నాగాలాండ్ గవర్నర్‌గా కూడా అశ్వనీకుమార్ పనిచేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నారా.. లేకుంటే ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News