ఈటల వర్సెస్ కేసీఆర్: ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ఈటల ఫైర్

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయరని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్ల గురించి తనకున్న అవగాహన ఎవరికీ లేదని కేసీఆర్ చెబుతారని, ఒకసారి సన్న వడ్లే పండించాలని చెబుతారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎవరి సూచనలు పాటించరని, మోడ్రన్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎక్కడా ఏర్పాటు చేయలేదని ఈటల అన్నారు. ముందుచూపు లేకపోవడం […]

Update: 2021-11-18 04:39 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయరని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్ల గురించి తనకున్న అవగాహన ఎవరికీ లేదని కేసీఆర్ చెబుతారని, ఒకసారి సన్న వడ్లే పండించాలని చెబుతారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎవరి సూచనలు పాటించరని, మోడ్రన్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎక్కడా ఏర్పాటు చేయలేదని ఈటల అన్నారు. ముందుచూపు లేకపోవడం వల్ల ధాన్యం కొనుగోలు విషయంలో ఈ దుస్థితి దాపురించిందని ఈటల ఆరోపించారు.

Tags:    

Similar News