లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే ఇక జైలుకే

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కానీ, కొందరు యథేచ్ఛగా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. కఠినంగా లాక్‌డౌ‌న్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 415కు చేరుకుంది. ఈ నేపథ్యంలో 82 జిల్లాలను పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారమే ఆదేశాలు […]

Update: 2020-03-23 01:11 GMT

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కానీ, కొందరు యథేచ్ఛగా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. కఠినంగా లాక్‌డౌ‌న్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 415కు చేరుకుంది. ఈ నేపథ్యంలో 82 జిల్లాలను పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారమే ఆదేశాలు జారీ చేసింది.

Tags: coronavirus, update states asked to strictly enforce lockdown violators to face legal action

Tags:    

Similar News