రాజకీయ వర్గాల్లో టెన్షన్.. మరో 10 నెలల్లో ఎన్నికలంటూ రేవంత్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మరో 10 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించబోమని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌పై నేతల తిరుగుబాటు మొదలవుతుందని పేర్కొన్నారు. వ్యతిరేకత పెరుగకముందే 2022 ఆగస్టులో గుజరాత్‌తో పాటుగా తెలంగాణలోనూ […]

Update: 2021-10-18 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మరో 10 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించబోమని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.

సోమవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌పై నేతల తిరుగుబాటు మొదలవుతుందని పేర్కొన్నారు. వ్యతిరేకత పెరుగకముందే 2022 ఆగస్టులో గుజరాత్‌తో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరుపుతారని జోస్యం చెప్పారు.

 

Tags:    

Similar News