ఏపీ మండలి ఖాళీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసన మండలిలో మోపిదేవి వెంకటరమణ స్థానం ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 2023 వరకు గడువు ఉన్నా మోపిదేవి రాజ్యసభకు ఎన్నికావడంతో తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఖాళీ ఏర్పడింది. ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 13 వరకు నామినేషన్ల‌ను స్వీకరించనున్నారు. 14న స్క్రూటిని, 17 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరించే అవకాశం ఉంది. 24న […]

Update: 2020-08-06 03:34 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసన మండలిలో మోపిదేవి వెంకటరమణ స్థానం ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 2023 వరకు గడువు ఉన్నా మోపిదేవి రాజ్యసభకు ఎన్నికావడంతో తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఖాళీ ఏర్పడింది. ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 13 వరకు నామినేషన్ల‌ను స్వీకరించనున్నారు. 14న స్క్రూటిని, 17 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరించే అవకాశం ఉంది. 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుంది.

Tags:    

Similar News