మహిళల భద్రతకు ‘ఈ- రక్షాబంధన్’

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించేందుకు ఈ-రక్షాబంధన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా మహిళలకు, అమ్మాయిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. య్యూ టూబ్ చానెల్ ద్వారా పాఠశాలలు, కాలేజీల్లో మహిళలకు సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా తమను […]

Update: 2020-08-02 10:58 GMT

దిశ, వెబ్ డెస్క్ :
ఏపీలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించేందుకు ఈ-రక్షాబంధన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సోమవారం రాఖీ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా మహిళలకు, అమ్మాయిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. య్యూ టూబ్ చానెల్ ద్వారా పాఠశాలలు, కాలేజీల్లో మహిళలకు సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా తమను తాము కాపాడుకోవాలనే దానిపై మెళకువలు నేర్పించనున్నారు.

Tags:    

Similar News