శ్రీవారి సేవలో ప్రముఖ సినీ నటి జయప్రద..

అలనాటి చలనచిత్ర సినీనటి జయప్రద కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Update: 2024-04-28 08:14 GMT

దిశ,తిరుమల: అలనాటి చలనచిత్ర సినీనటి జయప్రద కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండలంలో ఆమెకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయం వెలుపల జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా మరియు బంగారం ఆంధ్రప్రదేశ్‌గా చేయాలని, అలాగే మన రాష్ట్రానికి ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం కొంతైనా డబ్బులు అందించే విధంగా చూడాలన్నారు. నేను ఎలక్షన్ లో ప్రచారాలు చేసే దానికి బీజేపీ తరఫున నుంచి పురందేశ్వరి పిలిస్తే తప్పకుండా వచ్చి ప్రచారం చేస్తానని ఆమె తెలిపారు.

Similar News