ఎన్నికల కమిషన్‌కు ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదా.?

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతుంటే ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించిందని, వారికి ప్రజల ఇబ్బందులు కనిపించట్లేవా అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కోఆర్డినేషన్ కన్వినర్ నిరంజన్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయాలని కమిషనర్ పార్థసారధిని కోరుతూ నిరంజన్ గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రతను పట్టించుకోని ఎన్నికల కమిషన్ తీరు దురదృష్టకరమన్నారు. కరోనా నిబంధనలను రాజకీయ నాయకులు పాటించడం లేదని చెబుతున్నా ఎన్నికల […]

Update: 2021-04-22 08:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతుంటే ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించిందని, వారికి ప్రజల ఇబ్బందులు కనిపించట్లేవా అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కోఆర్డినేషన్ కన్వినర్ నిరంజన్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయాలని కమిషనర్ పార్థసారధిని కోరుతూ నిరంజన్ గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రతను పట్టించుకోని ఎన్నికల కమిషన్ తీరు దురదృష్టకరమన్నారు.

కరోనా నిబంధనలను రాజకీయ నాయకులు పాటించడం లేదని చెబుతున్నా ఎన్నికల కమిషన్ తన బాధ్యతను ఎందుకు విస్మరిస్తుందో చెప్పాలని కోరారు. ఈ రోజు విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రచార సమయాన్ని కుదించిందే తప్ప ఎన్నికలను వాయిదా వేయలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుందా చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమైందని కమిషన్ చెప్పిందని, మరి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు ఎన్నికలను ప్రకటించకుండా ద్వంద్వ వైకరిని చూపిస్తుందన్నారు.

 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News