రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి భేష్ : గవర్నర్ తమిళిసై

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలు బాగా పనిచేస్తున్నాయని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కితాబునిచ్చారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై గత కొంతకాలంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో బుధవారం ఆయన నివాసంలో భేటీ అయిన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా […]

Update: 2021-08-11 10:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలు బాగా పనిచేస్తున్నాయని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కితాబునిచ్చారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై గత కొంతకాలంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో బుధవారం ఆయన నివాసంలో భేటీ అయిన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించనున్నట్లు అమిత్ షా హామీ ఇచ్చారని గవర్నర్ తెలిపారు.

Tags:    

Similar News