శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ 

దిశ, ఏపీ బ్యూరో: కరోనా ప్రభావంతో భక్తుల సందడి లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తి ఆలయం ఎట్టకేలకు సోమవారం భక్తుల రద్దీతో కళకళలాడింది. జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శనానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలతోపాటు రుద్రాభిషేకం, కల్యాణోత్సవం సేవల్లో పాల్గొన్నారు. సాధారణ దర్శనానికి భక్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో రావడంతో ఆలయంలో నాలుగు నెలల తర్వాత భక్తజన సందోహం కనులవిందు చేసింది.

Update: 2020-08-24 10:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: కరోనా ప్రభావంతో భక్తుల సందడి లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తి ఆలయం ఎట్టకేలకు సోమవారం భక్తుల రద్దీతో కళకళలాడింది. జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శనానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

రాహు కేతు సర్ప దోష నివారణ పూజలతోపాటు రుద్రాభిషేకం, కల్యాణోత్సవం సేవల్లో పాల్గొన్నారు. సాధారణ దర్శనానికి భక్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో రావడంతో ఆలయంలో నాలుగు నెలల తర్వాత భక్తజన సందోహం కనులవిందు చేసింది.

Tags:    

Similar News