ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-04-26 03:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ శివారు మల్లారం ఫారెస్ట్‌‌లో డీసీఎం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా వారందరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతులు కమ్మర్‌పల్లి వాసులుగా తెలుస్తోంది. బాధితులందరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News