పసికందుల తలలు నరికి.. బాలికలపై అత్యాచారం.. ఇజ్రాయెల్ దాడుల్లో భయానక నిజాలు..

హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై వార్ ప్రకటించి ఆ దేశంపై భీకరంగా విరుచుకుపడ్డారు.

Update: 2023-10-14 12:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై వార్ ప్రకటించి ఆ దేశంపై భీకరంగా విరుచుకుపడ్డారు. అయితే.. ఈ దాడులకు తెగబడిన హమాస్ ఉగ్రవాదుల్లో ఒకరిని సజీవంగా పట్టుకుంది ఇజ్రాయెల్ సైన్యం. అతడిని బంధించిన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించగా.. భయానక నిజాలు బయట పడ్డాయి.

ఉగ్రవాది మాట్లాడుతూ.. దాడి సమయంలో పిల్లలు, పసికందులు, మహిళలు, వృద్ధులతో సహా తమకు కనిపించిన ప్రతి ఒక్కరినీ హతమార్చినట్లు తెలిపాడు. అంతే కాకుండా పసి కందులు అని కూడా చూడకుండా వారి తలలు నరికి నేలపై ఉంచినట్లు పేర్కొన్నాడు. హమాస్ టెర్రరిస్టులు బాలికలపై అత్యాచారం చేశారని చెప్పాడు. హమాస్ ఉగ్రవాదులు సాగించిన క్రూరత్వం గురించి ఈ ఉగ్రవాది చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటి వరకు 1300 మందికి పైగా ఇజ్రాయెల్ దేశస్థులు ప్రాణాలు కోల్పోయారు. 3200 మందికి పైగా గాయపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి

Tags:    

Similar News