దారుణం..అనుమానంతో భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త

మండలంలోని వెంగళమ్మ చెరువు గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యనే హతమార్చిన భర్త. వివరాల్లోకి వెళితే..

Update: 2024-04-27 10:43 GMT

దిశ ప్రతినిధి,పుట్టపర్తి: మండలంలోని వెంగళమ్మ చెరువు గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యనే హతమార్చిన భర్త. వివరాల్లోకి వెళితే..భార్య పైన అనుమానం పెంచుకొని అతి కిరాతకంగా నరికి చంపిన వాలంటీర్ పవన్ కుమార్. ఇటీవల వాలంటీర్ల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వాలంటీర్లు అమ్మాయిలని ఎత్తుకెళ్లడం, మద్యం విక్రయాలు చేస్తూ పట్టుబడడం, అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వసాధారణమైంది. ఇది ఇలా ఉండగా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు గ్రామానికి చెందిన వాలంటీర్ ఏకంగా భార్యనే హతమార్చి పోలీస్ రికార్డులు ఎక్కాడు. భార్య త్రివేణి 22 పై అనుమానం పెంచుకొని తరచూ హింసిస్తూ ఉండేవాడు.

శుక్రవారం రాత్రి 9 గంటల సమయాన కొడవలితో స్వగృహంలో నరికి చంపాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ త్రివేణి ప్రాణాలు విడిచింది. పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన త్రివేణి గత 4 సంవత్సరాల క్రితం వీరి వివాహమైంది. వివాహమైన రోజునుంచి ఆమెకు వేధింపులకు గురి చేశాడు. తరచూ చితకబాదుడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసేవాడని స్థానిక బంధువులు తెలుపుతున్నారు. త్రివేణి చాలా మంచి అమ్మాయిగా పేరు ఉంది. అనుమానం పెంచుకున్న వాలంటీర్ పవన్ ఆమెను అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటనతో గ్రామం ఒక్కపాటిగా ఉలికిపాటుకు గురయింది. తండోపతండాలుగా వెళ్లి రక్తపు మడుగులో ఉన్న త్రివేణి చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని వాలంటీర్ పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Similar News