ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా

గురువారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది.

Update: 2024-05-09 12:55 GMT

దిశ, ఖమ్మం రూరల్ ​: గురువారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. వేసవి సెలవులు రావడంతో సరదాగా మున్నేరులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఖమ్మం నగరం మమత హాస్పిటల్​ వెనకాల నివాసం ఉంటున్న అముదాల చిరంజీవి కుమారులు అముదాల లోకేష్​ (13), అముదాల హరిష్​(9), పక్కింటి అబ్బాయి బాణోత్​ గణేష్​ కలిసి దంసలాపురం వద్ద గల మున్నేరులో

    ఈత కొట్టేందుకు వెళ్లారు. మున్నేరు పై హైవే పనులు జరుగుతున్నాయి. వంతెన వద్డ పెద్ద లోయ ఉన్న విషయాన్ని గమనించని ముగ్గురు చిన్నారులు ఆ లోయలో దూకి నీట మునిగారు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆ చిన్నారులు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్​ ఎస్​ఐ రామారావు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి, శవాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి

ఈ ఘటనలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృత్యువులో సైతం కలిసి వెళ్లారు. చిన్న వయస్సులోనే మరణించడంతో తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు రోధిస్తున్నతీరు అందరినీ కంటతడి పెట్టిచ్చింది.  

Similar News