ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్.. ముఠా అరెస్ట్

దిశ,మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడే ఏడు మంది సభ్యులను టాస్క్ ఫోర్స్, సీసీఎస్, మహాబాబాబాద్ టౌన్  పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 7 సెల్ ఫోన్లు, 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ టౌన్ సీఐ వెంకటరత్నం తెలిపారు. ఇంకా పరారీలో ఇద్దరు సభ్యులు ఉన్నారని అన్నారు. అరెస్టయిన వారిలో ఎన్. దినేష్,ఎన్ రామకృష్ణ ,గొర్రె ఓంప్రకాష్ చింతల రమేష్, తోట […]

Update: 2021-10-13 06:45 GMT

దిశ,మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడే ఏడు మంది సభ్యులను టాస్క్ ఫోర్స్, సీసీఎస్, మహాబాబాబాద్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 7 సెల్ ఫోన్లు, 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ టౌన్ సీఐ వెంకటరత్నం తెలిపారు. ఇంకా పరారీలో ఇద్దరు సభ్యులు ఉన్నారని అన్నారు. అరెస్టయిన వారిలో ఎన్. దినేష్,ఎన్ రామకృష్ణ ,గొర్రె ఓంప్రకాష్ చింతల రమేష్, తోట వినయ్, మెతుకు కుమార్, తాటిపాముల అనిల్ లు ఉన్నారు.

పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలోనూ పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్స్ జరుగుతున్నాయి. పట్టణాలకే పరిమితమైన సంస్కృతి నేడు మండల కేంద్రంలో వ్యాపించింది. గత కొద్ది రోజులుగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కొందరు టీవీల్లోనూ, మరికొందరు స్మార్ట్ మొబైల్ లో లైవ్ మ్యాచ్ చూస్తూ ఈ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్ లకు పాల్పడి అరెస్టయిన కొంతమందిలో లక్షల రూపాయల డబ్బులను సైతం పోగొట్టుకున్న వారు ఉన్నారు.

Similar News