మంత్రిని నిలదీసిన కార్పొరేటర్లు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లోలోకి వరదనీరు చేసి అస్తవ్యస్తం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్‌గూడ, కురుమలగూడలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి పర్యటించడంపై స్థానిక కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు, మూడు రోజుల నుంచి స్థానిక కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బస్తీలో తిరుగుతూ ప్రజల […]

Update: 2020-10-15 22:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లోలోకి వరదనీరు చేసి అస్తవ్యస్తం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్‌గూడ, కురుమలగూడలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి పర్యటించడంపై స్థానిక కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు, మూడు రోజుల నుంచి స్థానిక కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బస్తీలో తిరుగుతూ ప్రజల అవసరాలు తీరుస్తూ ఉన్నామన్నారు. అలాంటి తమకు సమాచారం ఇవ్వకుండా మంత్రి వార్డుల్లో తిరగడం దారుణమన్నారు.

Tags:    

Similar News