ఏపీలో 7,133కు చేరిన కరోనా మరణాలు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 40,986మందికి పరీక్షలు నిర్వహించగా 197మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,85,234కు చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,133గా ఉంది. ప్రస్తుతం 2,411 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,75,690మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 234మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,23,96,593మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతపురం […]

Update: 2021-01-12 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 40,986మందికి పరీక్షలు నిర్వహించగా 197మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,85,234కు చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,133గా ఉంది. ప్రస్తుతం 2,411 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,75,690మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 234మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,23,96,593మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో 32, తూర్పుగోదావరిలో 19, గుంటూరులో 31, కడపలో 14, కృష్ణా జిల్లాలో 49, కర్నూలులో 3, నెల్లూరులో 6, ప్రకాశంలో 5, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 15, వియజనగరంలో 3, పశ్చిమగోదావరి జిల్లాలో 7కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News