అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్‌ది PHD కంప్లీట్: చంద్రబాబు సెటైర్

అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్‌ పీహెచ్‌డీ కంప్లీట్ చేశారని టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు సెటైర్ వేశారు.

Update: 2024-04-30 14:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్‌ పీహెచ్‌డీ కంప్లీట్ చేశారని టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు సెటైర్ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం దెందులూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. నాయకుడంటే సింహం, పులి అని చెప్పుకోవడం కాదు.. మీ పిల్లలకు ఉద్యోగాలిచ్చేవాడు నాయకుడన్నారు. గంజాయికి బానిసల్ని చేసేవాడు నాయకుడు కాదు.. వ్యవసాయాన్ని బాగు చేసేవాడు నాయకుడు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై కేసులు పెట్టారని.. ఎన్ని కేసులు పెట్టిన మీ భవిష్యత్ కోసం నిలదొక్కుకుని పని చేస్తున్నామన్నారు. కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని.. తప్పుడు కేసులు పెట్టిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాదని కార్యకర్తల్లో బాబు భరోసా నింపారు. ఇప్పటిదాకా నా మంచితనాన్నే చూశారని.. రాబోయే రోజుల్లో నా కఠినత్వాన్ని చూడబోతున్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ విడుదల చేసిన మన మేనిఫెస్టో అదిరిపోయిందని.. సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. 

Read More..

AP:హత్యలు చేసిన వారికి శిక్షలు తప్పవు:చంద్రబాబు నాయుడు  


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News