నేను కూడా పీసీసీ రేసులో ఉన్నా..

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత రాజకీయం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఓడినా.. నైతికంగా గెలిచిందని అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి బీజేపీ, ఎంఐఎం సీట్లు సాధించాయని వెల్లడించారు. బీజేపీ చూసి ఎవరూ ఓట్లు వేయలేదని, అందరూ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని చూసి వేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలుపు, ఓటములను కాంగ్రెస్ […]

Update: 2020-12-05 08:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత రాజకీయం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఓడినా.. నైతికంగా గెలిచిందని అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి బీజేపీ, ఎంఐఎం సీట్లు సాధించాయని వెల్లడించారు. బీజేపీ చూసి ఎవరూ ఓట్లు వేయలేదని, అందరూ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని చూసి వేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలుపు, ఓటములను కాంగ్రెస్ ఎప్పుడైనా సమానంగా చూస్తుందని అన్నారు. అంతేగాకుండా పీసీసీ రేసులో తాను కూడా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా త్వరలో రాహుల్ గాంధీని కలుస్తానని అన్నారు.

Tags:    

Similar News