గులాబీకి కమలం కౌంటర్

నిర్మల్ జిల్లా కేంద్రంలో వివాదస్పదమైన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్, బీజేపీల నేతలు ఎవరికి వారుగా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. శివాజీ విగ్రహంపై గులాబీ రంగు వస్త్రాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు గొడవకు దిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ వస్త్రం ద్వారానే విగ్రహావిష్కరణ చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పడకండి రమాదేవి నిర్మల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. గులాబీ రంగు వస్త్రం ఎలా వాడతారని […]

Update: 2020-02-19 08:10 GMT

నిర్మల్ జిల్లా కేంద్రంలో వివాదస్పదమైన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్, బీజేపీల నేతలు ఎవరికి వారుగా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. శివాజీ విగ్రహంపై గులాబీ రంగు వస్త్రాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు గొడవకు దిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ వస్త్రం ద్వారానే విగ్రహావిష్కరణ చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పడకండి రమాదేవి నిర్మల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. గులాబీ రంగు వస్త్రం ఎలా వాడతారని ప్రశ్నించడంతో పాటు వెంటనే కాషాయ రంగు వస్త్రం తెప్పించారు. ఆ తర్వాత విగ్రహంపై కాషాయ వస్త్రం కప్పి మళ్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

Tags:    

Similar News