చైనా, పాక్‌ కంపెనీలకు షరతులు

న్యూఢిల్లీ: కమర్షియల్ కోల్ మైనింగ్‌లో పెట్టుబడులకు భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల్లోని కంపెనీలకు కేంద్రం షరతులు విధించింది. కమర్షియల్ కోల్ మైనింగ్‌లో ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లు పెట్టాలనుకునే పొరుగుదేశాల కంపెనీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న కోల్ మైనింగ్ వేలాలను ఉటంకిస్తూ ఈ నిబంధనను కేంద్రం పేర్కొంది. దీనితోపాటు పాకిస్తాన్ పౌరుడు లేదా ఆ దేశ కంపెనీ భారత్‌లో ప్రభుత్వమార్గాల్లోనే పెట్టుబడులు పెట్టాలని, డిఫెన్స్, స్పేస్, అటామిక్ ఎనర్జీ రంగాల్లో […]

Update: 2020-08-03 11:19 GMT

న్యూఢిల్లీ: కమర్షియల్ కోల్ మైనింగ్‌లో పెట్టుబడులకు భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల్లోని కంపెనీలకు కేంద్రం షరతులు విధించింది. కమర్షియల్ కోల్ మైనింగ్‌లో ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లు పెట్టాలనుకునే పొరుగుదేశాల కంపెనీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న కోల్ మైనింగ్ వేలాలను ఉటంకిస్తూ ఈ నిబంధనను కేంద్రం పేర్కొంది. దీనితోపాటు పాకిస్తాన్ పౌరుడు లేదా ఆ దేశ కంపెనీ భారత్‌లో ప్రభుత్వమార్గాల్లోనే పెట్టుబడులు పెట్టాలని, డిఫెన్స్, స్పేస్, అటామిక్ ఎనర్జీ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు నిషేధముందని తెలిపింది.

Tags:    

Similar News