ప్రతి గింజను కొంటాం.. రైతులకు కలెక్టర్ హామీ

దిశ, కాటారం: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం కాటారం మండలంలో నిర్వహించిన రైతు అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని, వరి పంట వేసినా కొనుగోలు కేంద్రాలు మాత్రం ఉండవన్నారు. అందుకే రైతులు లాభదాయకమైన మినుములు, పెసర, ఇతర […]

Update: 2021-12-06 06:00 GMT

దిశ, కాటారం: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం కాటారం మండలంలో నిర్వహించిన రైతు అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని, వరి పంట వేసినా కొనుగోలు కేంద్రాలు మాత్రం ఉండవన్నారు. అందుకే రైతులు లాభదాయకమైన మినుములు, పెసర, ఇతర ఆరు తడి పంటలు వేయాలని కలెక్టర్ సూచించారు.

Tags:    

Similar News