మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

దిశ, వెబ్ డెస్క్: ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మహద్ తాలుకా కేంద్రంలోని కాజల్ పురలో ఉన్న ఐదంతస్తుల భవనం సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీస్తున్నారు. ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, ఆ భవనంలో మొత్తం 45 ప్లాట్లు ఉన్నాయని, ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. […]

Update: 2020-08-25 00:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మహద్ తాలుకా కేంద్రంలోని కాజల్ పురలో ఉన్న ఐదంతస్తుల భవనం సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీస్తున్నారు. ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, ఆ భవనంలో మొత్తం 45 ప్లాట్లు ఉన్నాయని, ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News