సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారు..!

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. ఈ నెల 23వ తేదీన జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు తిరుమలలో బస చేయనున్నారు. గరుడసేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 24వ తేదీన తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనం తర్వాత సుందరకాండ పారాయణంలో పాల్గొననున్నారు. సీఎం జగన్‎తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప తిరుమలకు రానున్నారు. కర్ణాటక అతిథి […]

Update: 2020-09-12 04:17 GMT

దిశ, వెబ్‎డెస్క్:

ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. ఈ నెల 23వ తేదీన జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు తిరుమలలో బస చేయనున్నారు. గరుడసేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఈ నెల 24వ తేదీన తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనం తర్వాత సుందరకాండ పారాయణంలో పాల్గొననున్నారు. సీఎం జగన్‎తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప తిరుమలకు రానున్నారు. కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపనలో ఇరు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.

Tags:    

Similar News