సీఎం జగన్ విశాఖ పర్యటన రద్దు
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం విశాఖ పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటనలో వెల్లడించింది. విశాఖలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. ఎన్ఏడీ జంక్షన్లో ఫ్లైఓవర్తో పాటు, వీఎంఆర్డీఏ పూర్తి చేసిన 6 ప్రాజెక్టులు, ఉడా పార్క్తోపాటు జీవీఎంసీ పూర్తిచేసిన 4 స్మార్ట్ ప్రాజెక్ట్లను ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయినట్లు సీఎంవో తెలిపింది. సీఎం పర్యటన రద్దు […]
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం విశాఖ పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటనలో వెల్లడించింది. విశాఖలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. ఎన్ఏడీ జంక్షన్లో ఫ్లైఓవర్తో పాటు, వీఎంఆర్డీఏ పూర్తి చేసిన 6 ప్రాజెక్టులు, ఉడా పార్క్తోపాటు జీవీఎంసీ పూర్తిచేసిన 4 స్మార్ట్ ప్రాజెక్ట్లను ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయినట్లు సీఎంవో తెలిపింది. సీఎం పర్యటన రద్దు అవ్వడంతో ప్రారంభోత్సవాలను సైతం అధికారులు వాయిదా వేశారు.