కత్తి కార్తీకపై కేసు నమోదు

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కత్తి కార్తీకపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‎లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ‎లో కార్తీకపై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఓ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కార్తీకతో పాటు ఆమె అనుచరులు కోటీ రూపాయల మోసానికి పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమీన్‎పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు కత్తి కార్తీక మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు ఫిర్యాదులో […]

Update: 2020-10-16 07:57 GMT

దిశ, వెబ్‎డెస్క్:
దుబ్బాక ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కత్తి కార్తీకపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‎లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ‎లో కార్తీకపై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఓ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కార్తీకతో పాటు ఆమె అనుచరులు కోటీ రూపాయల మోసానికి పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అమీన్‎పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు కత్తి కార్తీక మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్లు తెలిపారు. ఆమె నుంచి తన డబ్బులు ఇప్పించాలని బాధితుడు కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News