యూపీఎస్సీ సీడీఎస్‌ఈ - 2022 ఫలితాలు విడుదల

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ-2) 2022 ఫలితాలను యూపీఎస్సీ సెప్టెంబర్ 23న విడుదల చేసింది..Latest Telugu News

Update: 2022-09-23 16:37 GMT

దిశ, ఎడ్యుకేషన్: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ-2) 2022 ఫలితాలను యూపీఎస్సీ సెప్టెంబర్ 23న విడుదల చేసింది. ఈ పరీక్ష సెప్టెంబర్ 4న జరిగింది. మొత్తం 6658 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది.

ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యూపీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచినట్లు పేర్కొంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ లలో నియామకానికి యూపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించింది.

Also Read : గ్రూపు-1 అప్లై చేశారా.. ఈసారి ఎగ్జామ్ రాయడం అంత ఈజీ కాదు!

Similar News