భారీ రిక్రూట్‌మెంట్.. 38,800 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది భర్తీ

దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. తన బడ్జెట్ 2023 ప్రసంగంలో

Update: 2023-02-02 15:22 GMT

దిశ,కెరీర్ : దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. తన బడ్జెట్ 2023 ప్రసంగంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్)లోని 740 పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని కేంద్రం నియమిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్ మెంట్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Read more:

ఏపీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ తేదీలు ఇవే.. 

TSPSC తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్ష తేదీ వెల్లడి .. పూర్తి వివరాలివే 

Tags:    

Similar News