పీజీ విద్యార్థులకు మహీంద్రా సాక్షం స్కాలర్షిప్ 2022-23
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న డ్రైవర్ల పిల్లల కోసం మహీంద్రా ఫైనాన్స్ సాక్షం స్కాలర్షిప్ 2022-23 ప్రకటన విడుదల చేసింది..Latest Telugu News
దిశ, ఎడ్యుకేషన్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న డ్రైవర్ల పిల్లల కోసం మహీంద్రా ఫైనాన్స్ సాక్షం స్కాలర్షిప్ 2022-23 ప్రకటన విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన డ్రైవర్ల పిల్లల చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్ ను మహీంద్రా ఫైనాన్స్ అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత:
విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారై ఉండాలి.
గత పరీక్షలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ పిల్లలు అయి ఉండాలి.
విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం రూ. 4 లక్షల లోపు ఉన్న వారు అర్హులు.
స్కాలర్షిప్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 20, 000 స్కాలర్షిప్ లభిస్తుంది.
కావలసిన పత్రాలు:
గత పరీక్షల మార్క్ షీట్.
ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్
కుటుంబ ఆదాయ ధ్రువపత్రం
చదువుతున్న పాఠశాల అడ్మిషన్ ప్రూఫ్
విద్యార్థి బ్యాంక్ అకౌంట్ వివరాలు
డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్
కాంట్రాక్ట్ కాపీ/ఇన్ కమ్ ప్రూఫ్/ఎంప్లాయి గుర్తింపు కార్డ్..
అడ్రస్ ప్రూఫ్
విద్యార్థి ఫొటోగ్రాఫ్
చివరి తేదీ: అక్టోబర్ 31, 2022
వెబ్సైట్: https://www.buddy4study.com